Saturday, 4 January 2020

శాంసంగ్ నుంచి ఫోల్డబుల్‌‌ ఫోన్

శాంసంగ్ నుంచి ఫోల్డబుల్‌‌ ఫోన్

త్వరలో  శాంసంగ్  గెలాక్సీ  ఫోల్డ్ -2 ఫోన్ ను విడుదల చేయనుంది. దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ 2020 లో అన్నీ రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  వాటిలో ముఖ్యంగా ఫ్లాగ్ షిప్ ఎస్ 11, గెలాక్సీ ఫోల్డ్ 2 ఫోన్ల విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
అయితే ఇప్పటికే ఎస్ 11 గురించి ఐడియా ఉన్నప్పటికి, గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ఫీచర్స్ గురించి శాంసంగ్ గోప్యంగా ఉంచింది. దీంతో  ఎస్ 11 గురించి అనేక రూమర్స్ టెక్ ప్రపంచంలో చక్కెర్లు కొడుతున్నాయి.
♦  ఈ ఫోన్ రిలీజ్ ఎప్పుడు ..
ఈ ఫోన్ విడుదల గురించి కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికి , ఫ్రిబవరి నెలలో ఎస్11 తో పాటు మరికొన్ని ఫొన్లు  విడుదలవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కానీ ఫిబ్రవరి నెలలో ఎస్ 11 గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ను విడుదల చేసిన తరువాతనే మిగిలిన స్మార్ట్ ఫోన్ లను శాంసంగ్ విడుదల చేయాలని భావిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
♦  గెలాక్సీ2 – ఫోల్డ్ మొబైల్ ఎలా ఉండబోతుందంటే..?
సాధారణంగా గెలాక్సీ సిరీస్ లోని ఫోన్ మోడల్ ఎలా ఉంటుందో ఎస్ 11 ఫోల్డ్ మొబైల్ కూడా అలాగే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. బయటవైపు 4.6 అంగుళాల డిస్ ప్లే,  లోపల ప్రాధమిక 7.3-అంగుళాల ఫోల్డబుల్ ప్యానెల్‌ ఉంటుంది.
♦   2020లోనే అత్యంత ఖరీదైన  ఫోల్డ్ బుల్  మొబైల్ గా తీర్చిదిద్దేందుకు కసరత్తు
ఈ ఏడాది విడుదల చేసే ఈ ఫోన్ ను అత్యంత ఖరీదైందిగా, దృంఢంగా ఉండేలా శాంసంగ్ తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఆల్ట్రా తిన్ గ్లాస్ కవర్ తో ఫోన్ డిజైన్ చేయనుంది. అల్ట్రా తిన్ గ్లాస్ కవర్ తో డిజైన్ చేయడం ద్వారా ఫోన్ ను ఫోల్డ్ చేసేందుకు, ఫోల్డ్ చేసేసమయంలో ఎలాంటి గీతలు పడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోనుంది.
ఈ ఫోన్ తో పాటు అత్యంత ఖరీదైన మోటరోలా రేజర్ లాంటి క్లామ్ షెల్ డిజైన్ ను అందుబాటులోకి  తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ -11 ఫోల్డ్ 2కి ఎలాంటి సంబంధం లేకున్నా ఈ ఫోన్ కంటే క్లామ్ షెల్  తో  డిజైన్ చేసిన ఫోన్  కాస్ట్ ఎక్కువగా ఉండనుంది.
♦   గెలాక్సీ ఫోల్డ్ 2లో  ఎలాంటి ఫీచర్స్  ఉండబోతున్నాయి..?
శాంసంగ్ సంస్థ ఫోల్డ్ మొబైల్ గురించి  అంతగా తెలియని  కోర్ హార్డ్ వేర్ ను వినియోగించినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయినప్పటికి ఫ్లాష్ షిప్ స్పెసిఫికేషన్ తరహాలో మార్కెట్ ను శాసిస్తున్నట్లు కంపెనీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.
సాధారణంగా ఫోన్లు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865తో విడదలవుతాయి. కానీ  శాంసంగ్ సంస్థ ఫోల్డ్ మొబైల్ లో గెలాక్సీ 865 ఎస్ ఓఎస్ తో విడుదల చేయనుంది. 8జీబీ ర్యామ్ నుంచి  128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుందని తెలుస్తోంది.  శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ తో పోలిస్తే  గెలాక్సీ  ఫోల్డ్ -2 ఫోన్ లో  3 మాత్రమే లెన్స్ లు ఉంటాయి. ఆరు కెమెరాలు, బయటవైపు సింగల్ కెమెరా, లోపలి వైపు డ్యూయల్  కెమెరా ఉంటుంది. ఎప్పటిలాగే హెడ్ ఫోన్ జాక్ ను వదిలేసిన…సంస్థ  ఫోన్ జాక్ స్థానంలో  సీ టైప్ ఛార్జర్ పోర్ట్ ను ఇచ్చింది. ఈ ఫోన్ శాంసంగ్  యొక్క ఆండ్రాయిడ్ 10 బేస్డ్ వన్ యుఐ 2 ఆపరేటింగ్ సిస్టమ్ బాక్స్ నుండి బూట్ అవుతుందని భావిస్తుంది.
♦   శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ధర ఎంతంటే..?
గెలాక్సీ గోల్డ్ ఫోన్ తో పోలిస్తే గెలాక్సీ  ఫోల్డ్ -2 ఫోన్ కాస్ట్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు 2వేల డాలర్లు ఉంటుందని స్మార్ట్ ఫోన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సౌత్ సిటీలో ఊపందుకున్న రియల్ బూమ్

హైదరాబాద్ సౌత్ సిటీలో ఊపందుకున్న రియల్ బూమ్

హైదరాబాద్వెలుగుసిటీలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పటివరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లోనే కనిపించడంతో… ఆ ప్రాంతానికి ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. దీంతో ఐటీ కేంద్రంగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట వరకు ఎకరం భూమి ధర రూ.30 కోట్లకు చేరగా… మెరుగైన రవాణా, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో.. కంపెనీలన్నీ అటు వైపు మొగ్గుచూపాయి. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్ కు దగ్గరగా, ఓఆర్ఆర్ ఆనుకుని ఉండటంతో… సౌత్ సిటీలోనూ రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది.
 రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాల జోరు
సిటీ నలుదిశలా రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్లలో నిర్మాణ రంగానికి డిమాండ్ ఉండటంతో… సౌత్ సిటీలో ఉన్న చార్మినార్ కేంద్రంగా రాజేంద్రనగర్, మలక్ పేట్, సంతోష్ నగర్, చాంద్రయాణగుట్ట, ఫలక్ నుమా, రాజేంద్ర నగర్ సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి, కిషన్ బాగ్, నవాబ్ కుర్దు, సంతోష్ నగర్, లలిత్ భాగ్, ఉప్పుగూడ వంటి ప్రాంతాల్లో రెసిడెన్సియల్, కమర్షియల్ భవనాల నిర్మాణాలు జోరందుకున్నాయి. సౌత్ సిటీ చుట్టూ ఫార్మా సిటీ, ఆదిభట్ల ఎయిర్ స్పేస్, తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ, శ్రీశైలం హైవే, కోకాపేట న్యూ సిటీ, బుద్వేల్ ఐటీ పార్క్, కాంచన్ బాగ్ డీఆర్డీఎల్, రాజేంద్ర నగర్ ఆగ్రి వర్సిటీ వంటి ప్రాంతాలకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయి. దీంతో కమర్షియల్ యాక్టివిటీ బాగా పెరుగుతోంది. ఇక్కడ భూముల రేట్లు వెస్ట్, ఈస్ట్ సిటీతో సమానంగా ఉండగా… ఐటీ కారిడార్ కు చేరువలో, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటం సౌత్ జోన్ కు స్పెషల్ అడ్వాంటేజ్.
లాజిస్టిక్ హబ్ లకు అనుకూలం…
ఎయిర్ పోర్టుకు చేరువలో ఉండటంతో.. ఎక్కువగా లాజిస్టిక్ హబ్ లకు సౌత్ సిటీ అనుకూలంగా ఉంది. ఇప్పటికే పోచారంలో ఐటీ పార్కు డెవలప్ చేసినట్లుగా, ఈ ప్రాంతానికి పెద్దగా ఐటీ పార్కులు ఏర్పాటు చేయకపోయినా.. కూడా కమర్షియల్ పరంగా మంచి డిమాండే ఉంది. ముఖ్యంగా అపార్టుమెంట్లు ఇప్పుడిప్పుడే విస్తరిస్తుండగా, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లోనూ  అపార్టుమెంట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. రోడ్లు, స్కూళ్లు, విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి వస్తే గనుక ఈ ఏరియాకు మంచి డిమాండ్ ఉంటుంది. శాటిలైట్ టౌన్ షిప్పులు, వాక్ టు వర్క్ కాన్సెప్టులతో డెవలప్ చేయగలిగితే … సౌత్ సిటీ లో రియల్ క్రయవిక్రయాలు పుంజుకుంటాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
ఈ హోటల్​లో అన్నీ బుల్లి రూమ్సే

ఈ హోటల్​లో అన్నీ బుల్లి రూమ్సే

పని మీద ఊరు కాని ఊరు వెళ్తే.. ఉండటానికి చోటు ఒక సమస్యగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో లాడ్జిల్లో ఉందామంటే కంఫర్ట్‌‌గా ఉండకపోవచ్చు. పోనీ మంచి సౌకర్యాలున్న హోటల్‌‌లో దిగాలంటే.. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యను తీర్చేందుకు వచ్చిందే కాన్సెప్ట్‌‌ ‘క్యాప్సుల్‌‌ హోటల్‌‌’.  జపాన్‌‌లో చాలా ఏళ్ల క్రితమే మొదలైన ఈ ట్రెండ్‌‌.. వయా సింగపూర్‌‌, ఇండియా మీదుగా యూరప్‌‌ని చేరింది. ఇప్పుడు బ్యూటీసిటీ మిలాన్‌‌లో క్యాప్సుల్‌‌ హోటల్స్‌‌దే హవా నడుస్తోంది. ఇంతకీ ఈ ఇస్మార్ట్‌‌ హోటల్‌‌ రూపురేఖలు ఎలా ఉంటాయి? ఎందుకు వాటికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు?…
క్యాప్సుల్‌‌ హోటల్స్‌‌.. సింపుల్‌‌గా చెప్పాలంటే చిన్నసైజులో ఉండే బెడ్‌‌రూమ్స్‌‌తో కూడిన కాంప్లెక్స్‌‌లివి. ఒక చిన్న ఛాంబర్‌‌లో మినిమమ్‌‌ ఫెసిలిటీస్‌‌తో వీటిని ఏర్పాటు చేస్తారు. హోటల్స్‌‌తో పోలిస్తే రేటు చాలా తక్కువ. రాత్రిళ్లు పడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. పైగా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే పనుల మీద వేరే ఊర్లకు వెళ్లేవాళ్లు, టూరిస్టులు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వెస్ట్రన్ వరల్డ్‌‌లో వీటినే ‘పాడ్ హోటల్స్‌‌’ అంటారు. సాధారణంగా ఈ తరహా హోటల్స్‌‌ ఎయిర్‌‌పోర్ట్ దగ్గర్లో కనిపిస్తుంటాయి. అక్కడ వాటిని ‘స్లీప్‌‌బాక్స్‌‌’ పేరుతో పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోనూ క్యాప్సుల్‌‌ హోటల్స్‌‌ బిజినెస్‌‌ పెరుగుతోంది.
సకల సౌకర్యాలు
క్యాప్సుల్ హోటల్‌‌ ఛాంబర్‌‌లు చూడటానికి స్లీపర్‌‌ కోచ్‌‌ బస్సుల్లా ఉంటాయి. ఒక ఛాంబర్‌‌కి మరో ఛాంబర్‌‌ ఆనుకుని ఉంటుంది. ప్లాస్టిక్‌‌ టబ్‌‌ లాంటి నిర్మాణానికి అద్దాల సెటప్‌‌తో డోర్‌‌, దానికొక కర్టెన్‌‌ ఉంటుంది. లోపలికి పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. లోపల చిన్న బెడ్‌‌, లైట్‌‌, పవర్‌‌ ప్లగ్‌‌, వై–ఫై ఫెసిలిటీ ఉంటాయి. కొన్నిసార్లు టీవీ, ల్యాప్‌‌ట్యాప్‌‌ని ఇస్తారు. న్యూస్ పేపర్‌‌, రీడింగ్ మెటీరియల్స్‌‌ అందిస్తారు. జస్ట్ పడుకోవడానికి, రెస్ట్‌‌ తీసుకోవడానికి మాత్రమే సరిపోతాయివి. క్యాప్సుల్‌‌ హోటల్స్‌‌ ఆడ, మగకి విడివిడిగా ఉండొచ్చు. లేదంటే కపుల్‌‌ స్పెషల్‌‌గా ఉంటాయి. ఛాంబర్‌‌ కాంప్లెక్స్‌‌ బయట సామాన్లు భద్రపరుచుకోవడానికి ఒక లాకర్‌‌ ఉంటుంది. క్యాప్సుల్‌‌లో తినడానికి, సిగరెట్‌‌ తాగడానికి వీల్లేదు. అయితే బాత్‌‌రూమ్‌‌లు మాత్రం బయట కామన్‌‌గా ఉంటాయి. కొన్నింటిలో రెస్టారెంట్‌‌, షవర్స్‌‌, స్నాక్ బార్స్‌‌, పూల్స్‌‌.. ఎంటర్‌‌టైన్‌‌మెంట్ ఫెసిలిటీస్‌‌ సెపరేట్‌‌గా ఉంటాయి. కాకపోతే వాటికి కాస్ట్‌‌ ఎక్కువ ఉంటుంది. అయితే ఇరుకు ప్రదేశాలంటే భయం ఉన్నవాళ్లు క్యాప్సుల్ హోటల్‌‌కి దూరంగా ఉండటమే బెటర్‌‌.
వివోలో కొత్త ఫీచర్‌‌‌‌

వివోలో కొత్త ఫీచర్‌‌‌‌

Vivo to introduce earthquake warning feature in FunTouch OS 10
చైనాకు చెందిన స్మార్ట్‌‌ఫోన్‌‌ తయారీ సంస్థ ‘వివో’ త్వరలో కొత్త ఫీచర్‌‌‌‌ను అందుబాటులోకి తేనుంది. స్మార్ట్‌‌ఫోన్లలో ఉండే వెదర్‌‌‌‌ ఫీచర్‌‌‌‌కు అదనంగా ‘ఎర్త్‌‌క్వేక్‌‌ ఫీచర్‌‌‌‌’ను వివో ఫోన్లలో ప్రవేశపెట్టబోతోంది. ‘వివో’ ఫోన్లకు చెందిన ‘ఫన్‌‌టచ్‌‌ ఓఎస్‌‌ 10’ వెర్షన్‌‌లో ఈ ఫీచర్‌‌‌‌ ఉంటుందని కంపెనీ చెప్పింది. వివో ఫోన్లలో ఈ ఫీచర్‌‌‌‌ ఎనేబుల్ చేసుకుంటే చాలు. అక్కడికి దగ్గర్లో భూకంపం వచ్చే అవకాశాలు ఉంటే కొన్ని సెకండ్ల ముందే హెచ్చరిస్తుందని వివో పేర్కొంది. ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌‌‌‌ షావోమీకి చెందిన కొన్ని స్మార్ట్‌‌ఫోన్లలో ఉంది. ‘ఎమ్‌‌ఐయూఐ 11’తోపాటు కొన్ని ‘ఎమ్‌‌ఐ టీవీ’లలో కూడా ఈ ఫీచర్‌‌‌‌ ఉందని షావోమీ తెలిపింది. ఈ డివైజ్‌‌ వాడుతున్న యూజర్లకు భూకంపం గురించి కొన్ని సెకండ్ల ముందే వార్నింగ్‌‌ అలర్ట్‌‌ వస్తుంది. ‘వివో’ ఫోన్లకు సంబంధించి ఈ ఏడాది నుంచి ‘ఆన్‌‌లైన్‌‌ ఎక్స్‌‌క్లూజివ్‌‌ సేల్స్‌‌’ ఆపేస్తామని ప్రకటించింది. ‘2020లో కొత్త ప్రణాళికలకు అనుగుణంగా సెల్‌‌ఫోన్లకు సంబంధించి ఆన్‌‌లైన్‌‌ ఎక్స్‌‌క్లూజివ్‌‌ సేల్స్‌‌’ను ఆపేస్తాం.
ఆన్‌‌లైన్‌‌తోపాటు, రిటైల్‌‌ ఔట్‌‌లెట్‌‌లోనూ ఫోన్లను అందుబాటులో ఉంచుతాం’ అని వివో ప్రతినిధులు అన్నారు. వివోతోపాటు సామ్‌‌సంగ్‌‌, రియల్‌‌ మి, ఒప్పో లాంటి సంస్థలు కూడా ఈ ఏడాదిలో ఇదే పద్ధతిని ఫాలో అవనున్నాయి. త్వరలో విడుదలయ్యే అన్ని మోడల్స్‌‌ను ఆన్‌‌లైన్‌‌, ఆఫ్‌‌లైన్‌‌.. రెండు రకాలుగా అందుబాటులో ఉంచుతారు.
బయో డైవర్శిటీ ఫ్లై ఓవర్‌ను మళ్లీ తెరిచారు

బయో డైవర్శిటీ ఫ్లై ఓవర్‌ను మళ్లీ తెరిచారు

హైదరాబాద్ లోని బయో డైవర్శిటీ ఫ్లై ఓవర్ ను రీ ఓపెన్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు.  నవంబర్ 23.2019న ఫ్లై ఓవర్ పై కారు యాక్సిడెంట్ జరినగప్పటి నుంచి  ఫ్లైఓవర్ ను మూసివేశారు. తర్వాత ఫ్లైఓవర్  స్పీడ్ కంట్రోల్ కంట్రోల్ కోసం ప్రభుత్వం  నిపుణుల కమిటీని వేసింది. కమిటీ  సూచనల మేరకు జీహెచ్ఎంసీ చేపట్టిన పనులను ఇవాళ పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు
ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడిన మేయర్.. ఈ ఫ్లైఓవర్ పై వాహనదారులు 40 కి.మీ స్పీడ్ కు మించి వెళ్లకూడదన్నారు. ఫ్లైఓవర్ పై స్పీడ్ బ్రేకర్స్, కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫ్లైఓవర్ పై సెల్పీలు తీసుకోకుండా సైడ్ వాల్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి సెల్ఫీలు దిగితే ఫైన్ వేస్తామన్నారు. కొన్ని రోజుల పాటు వాహనదారుల కదలికలను, ఫ్లైఓవర్ ను పరిశీలిస్తామన్నారు.
కేసీఆర్ వార్నింగ్: ఓడితే మంత్రి పదవులు ఊడతాయి

కేసీఆర్ వార్నింగ్: ఓడితే మంత్రి పదవులు ఊడతాయి

త్వరలో జరగనున్నమున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్కటి ఓడిపోయినా మంత్రి పదవులు ఊడతాయని హెచ్చరించారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో  జరిగిన TRS విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తామన్నారు. పాత, కొత్త నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు క్యాడర్‌తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలన్నారు. పార్టీ ఒకసారి అభ్యర్థి ని ఫైనల్ చేసిన తర్వాత ఆ అభ్యర్థి గెలుపు కోసమే పని చేయాలని సూచించారు. అవసరమున్న దగ్గర మంత్రులు ప్రచారం చేస్తారన్నారు. మున్సిపోల్స్‌లో టికెట్ల పంపిణీ, ఎన్నికల ప్రచారం, అసంతృప్తుల బుజ్జగింపు, అభ్యర్థుల గెలుపు వరకూ ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు. మరోవైపు బీజేపీతో మనకు పోటీ అనే అపోహ వద్దని, మనకు ఎవరితోనూ పోటీ లేదన్నారు సీఎం కేసీఆర్.
వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి నగలు చోరీ

వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి నగలు చోరీ

తెలంగాణలోని ప్రముఖ దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయం పరిధిలో ఉన్న బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో నగలు చోరీ అయ్యాయి. అమ్మవారి నగలు కన్పించక పోవడంతో ఆలయ పూజారి అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. అమ్మవారి 2.5 గ్రాముల పుస్తెల తాడు, ముక్కు పుడక, కిలో వెండి గొడుగు చోరీ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆలయంలో పూజారులు వంతుల వారీగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఎవరో నగలు చోరీ చేసిఉంటారని తెలుస్తోంది. పూజారుల మార్పిడి క్రమంలో ఈ విషయం బయటకు వచ్చింది. పూజారులకు నోటీసులు జారీ చేశామని… విచారణ చేపట్టినట్లు ఆలయ ఉన్నతాధికారులు తెలిపారు.
మున్సిపోల్స్‌కు రిజర్వేషన్లు విడుదల

మున్సిపోల్స్‌కు రిజర్వేషన్లు విడుదల

పురపాలక ఎలక్షన్లకు సంబంధించి మొదటి దశ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఆయా వర్గాల వారీగా వార్డు పదవుల రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లను కేటాయించారు. ఎస్టీల జనాభా ఒక శాతానికి తక్కువగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లో ఒక వార్డును ఎస్టీలకు రిజర్వ్
చేశారు. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించింది. వార్డుల వారీ రిజర్వేషన్లు రేపు ఖరారు కానున్నాయి.
కార్పొరేషన్లలో రిజర్వేషన్లు
కరీంనగర్ – 60: ఎస్టీ -1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 3, బీసీ – 12, బీసీ మహిళ – 11, జనరల్ మహిళ – 16, జనరల్ – 14
రామగుండం – 36: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 2, ఎస్సీ మహిళ – 2, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 10, జనరల్ – 8
బడంగ్ పేట – 32: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 2, బీసీ – 5, బీసీ మహిళ – 5, జనరల్ మహిళ – 9, జనరల్ – 7
మీర్ పేట – 46: ఎస్టీ – 2, ఎస్టీ మహిళ – 1, ఎస్సీ -4, ఎస్సీ మహిళ -3, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 13, జనరల్ – 10
బండ్లగూడ జాగీర్- 22 : ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ -2, ఎస్సీ మహిళ – 1, బీసీ – 4, బీసీ మహిళ – 3, జనరల్ మహిళ – 7, జనరల్ – 4
బోడుప్పల్ – 28: ఎస్టీ -1, ఎస్టీ మహిళ -0, ఎస్సీ -2, ఎస్సీ మహిళ -1, బీసీ -5, బీసీ మహిళ -5, జనరల్ మహిళ -8, జనరల్ – 6
ఫీర్జాదిగూడ – 26: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 1, ఎస్సీ మహిళ – 1, బీసీ – 5, బీసీ మహిళ – 5, జనరల్ మహిళ – 7, జనరల్ – 6
జవహర్‌నగర్‌ – 28: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 2, బీసీ – 4, బీసీ మహిళ – 4, జనరల్ మహిళ – 8, జనరల్ – 6
నిజాంపేట – 33: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 1, ఎస్సీ మహిళ – 1, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 9, జనరల్ – 8
మున్సిపాలిటీ రిజర్వేషన్లు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 141 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో 128 మున్సిపాలిటీలు కాగా మరో 13 మున్సిపల్ కార్పోరేషన్‌లు‌గా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు 120 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. 8 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు లేవు. మరో  5 మున్సిపాలిటీలకు ఇంకా పదవీకాలం పూర్తవలేదు. వాటిలో జహీరాబాద్, మణుగూరు, పాల్వంచ, సిద్దిపేట, మందమర్రి ఉన్నాయి. కాగా.. రిజర్వేషన్ల వల్ల జడ్చర్ల, నకిరేకల్, అచ్చంపేట కార్పొరేషన్లకు సంబంధించి కేసు కోర్టులో ఉంది. కార్పొరేషన్లకు సంబంధించి.. మొత్తం 13 కార్పొరేషన్లలో మూడు కార్పొరేషన్లకు ప్రస్తుతం ఎన్నికలు లేవు. వాటిలో జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం ఉన్నాయి. వీటికి ఇంకా పదవీకాలం పూర్తి కాలేదు. కాగా మిగిలిన 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో కరీంనగర్, రామగుండం, బడంగ్ పేట, మీర్ పేట, బండ్లగూడ జాగీర్, బొడుప్పల్, ఫీర్జదిగూడ, జవహర్ నగర్, నిజాం పేట, నిజామాబాద్ ఉన్నాయి.
కేసీఆర్ వేములవాడ రాజన్నకు ఇచ్చిన మాట తప్పారు

కేసీఆర్ వేములవాడ రాజన్నకు ఇచ్చిన మాట తప్పారు

  • కేంద్ర నిధులతో ఆలయ అభివృద్ధి చేస్తామన్న ఎంపీ బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల జిల్లా: అధికార పార్టీ మాయమాటలు నమ్మొద్దని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నకి ఇచ్చిన మాటనే తప్పారని అన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయిస్తామని చెప్పి మర్చిపోయారని చెప్పారు. తమను ఎంపీ ఎన్నికల్లో గెలిపించినట్లుగానే మునిసిపల్ ఎన్నికల్లోనూ బీజేపీకి పట్టం కట్టాలని కోరారు ఎంపీ బండి సంజయ్. రాజన్న క్షేత్రం కేంద్రంగా వేములవాడలో శనివారం ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న ఆశీస్సులతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు.
అధికార పార్టీ ఓట్లెట్ల అడుగుతోంది
ఎన్నో ఏళ్లుగా రాజన్న క్షేత్రం అబివృద్దికి నోచుకొలేదన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నకి ఇచ్చిన మాట ప్రకారం 400 కోట్లు కేటాయించలేదని అన్నారు. కేంద్రం నిధులతో వేములవాడ రాజన్న ఆలయాన్ని అబివృద్ది  చేస్తామన్నారు. నిధులు లేవని చెబుతున్న అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు మళ్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగడానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ ప్రజల దృష్టిని మళ్లించడానికి  ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతోందన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి, ఆ తర్వాత విదేశాలకు వెళ్లి పోవడం అధికార ఎమ్యెల్యేకి కామన్‌గా అయిపోయిందని ఆరోపించారు ఎంపీ బండి సంజయ్. అధికార పార్టీ యొక్క మాయమాటలు, మభ్యపెట్టే మాటలను నమ్మొద్దని ప్రజలకు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
శ్లోకాలు జపించడంలో పూజారుల మధ్య వాగ్వాదం

శ్లోకాలు జపించడంలో పూజారుల మధ్య వాగ్వాదం

వైష్ణవ శాఖకు చెందిన రెండు వర్గాల మధ్య  గొడవ జరిగిన ఘటన కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం పూజా సమయంలో వైష్ణవ భక్తులైన తెంకలై, వడకలై వర్గాల మధ్య శ్లోకాలు జపించడంలో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
పెరుమాళ్ ఆలయం 8 వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలో తిరువేది పురం ఉత్సవం నిర్వహించారు.  ఆచారం ప్రకారం  తెంకలై శాఖ భక్తులు శ్రీ మహా విష్ణువును స్తుతిస్తూ అజ్వర్లు రాసి, పాడిన నలైరా దివ్య ప్రబంధం(4,000 తమిళ శ్లోకాల సంకలనం) పఠించడం ప్రారంభించారు. కానీ వడకలై వర్గం ఇందుకు అభ్యంతరం తెలిపింది. ఆ ప్రబంధాన్ని పఠించడం తమకు వ్యతిరేకమని గొడవకు దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు.
దీనిపై  తెంకలై బృందం.. వడకలై సభ్యులు తమను కిందికి నెట్టారని ఆరోపిస్తూ విష్ణుకాంచీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ ముగిసింది.