Saturday, 4 January 2020

వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి నగలు చోరీ

వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి నగలు చోరీ

తెలంగాణలోని ప్రముఖ దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయం పరిధిలో ఉన్న బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో నగలు చోరీ అయ్యాయి. అమ్మవారి నగలు కన్పించక పోవడంతో ఆలయ పూజారి అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. అమ్మవారి 2.5 గ్రాముల పుస్తెల తాడు, ముక్కు పుడక, కిలో వెండి గొడుగు చోరీ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆలయంలో పూజారులు వంతుల వారీగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఎవరో నగలు చోరీ చేసిఉంటారని తెలుస్తోంది. పూజారుల మార్పిడి క్రమంలో ఈ విషయం బయటకు వచ్చింది. పూజారులకు నోటీసులు జారీ చేశామని… విచారణ చేపట్టినట్లు ఆలయ ఉన్నతాధికారులు తెలిపారు.
Previous Post
Next Post

post written by:

0 comments: