బయో డైవర్శిటీ ఫ్లై ఓవర్ను మళ్లీ తెరిచారు

హైదరాబాద్ లోని బయో డైవర్శిటీ ఫ్లై ఓవర్ ను రీ ఓపెన్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. నవంబర్ 23.2019న ఫ్లై ఓవర్ పై కారు యాక్సిడెంట్ జరినగప్పటి నుంచి ఫ్లైఓవర్ ను మూసివేశారు. తర్వాత ఫ్లైఓవర్ స్పీడ్ కంట్రోల్ కంట్రోల్ కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసింది. కమిటీ సూచనల మేరకు జీహెచ్ఎంసీ చేపట్టిన పనులను ఇవాళ పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు
ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడిన మేయర్.. ఈ ఫ్లైఓవర్ పై వాహనదారులు 40 కి.మీ స్పీడ్ కు మించి వెళ్లకూడదన్నారు. ఫ్లైఓవర్ పై స్పీడ్ బ్రేకర్స్, కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫ్లైఓవర్ పై సెల్పీలు తీసుకోకుండా సైడ్ వాల్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి సెల్ఫీలు దిగితే ఫైన్ వేస్తామన్నారు. కొన్ని రోజుల పాటు వాహనదారుల కదలికలను, ఫ్లైఓవర్ ను పరిశీలిస్తామన్నారు.
0 comments: