Saturday, 4 January 2020

శాంసంగ్ నుంచి ఫోల్డబుల్‌‌ ఫోన్

శాంసంగ్ నుంచి ఫోల్డబుల్‌‌ ఫోన్

త్వరలో  శాంసంగ్  గెలాక్సీ  ఫోల్డ్ -2 ఫోన్ ను విడుదల చేయనుంది. దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ 2020 లో అన్నీ రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  వాటిలో ముఖ్యంగా ఫ్లాగ్ షిప్ ఎస్ 11, గెలాక్సీ ఫోల్డ్ 2 ఫోన్ల విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
అయితే ఇప్పటికే ఎస్ 11 గురించి ఐడియా ఉన్నప్పటికి, గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ఫీచర్స్ గురించి శాంసంగ్ గోప్యంగా ఉంచింది. దీంతో  ఎస్ 11 గురించి అనేక రూమర్స్ టెక్ ప్రపంచంలో చక్కెర్లు కొడుతున్నాయి.
♦  ఈ ఫోన్ రిలీజ్ ఎప్పుడు ..
ఈ ఫోన్ విడుదల గురించి కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికి , ఫ్రిబవరి నెలలో ఎస్11 తో పాటు మరికొన్ని ఫొన్లు  విడుదలవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కానీ ఫిబ్రవరి నెలలో ఎస్ 11 గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ను విడుదల చేసిన తరువాతనే మిగిలిన స్మార్ట్ ఫోన్ లను శాంసంగ్ విడుదల చేయాలని భావిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
♦  గెలాక్సీ2 – ఫోల్డ్ మొబైల్ ఎలా ఉండబోతుందంటే..?
సాధారణంగా గెలాక్సీ సిరీస్ లోని ఫోన్ మోడల్ ఎలా ఉంటుందో ఎస్ 11 ఫోల్డ్ మొబైల్ కూడా అలాగే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. బయటవైపు 4.6 అంగుళాల డిస్ ప్లే,  లోపల ప్రాధమిక 7.3-అంగుళాల ఫోల్డబుల్ ప్యానెల్‌ ఉంటుంది.
♦   2020లోనే అత్యంత ఖరీదైన  ఫోల్డ్ బుల్  మొబైల్ గా తీర్చిదిద్దేందుకు కసరత్తు
ఈ ఏడాది విడుదల చేసే ఈ ఫోన్ ను అత్యంత ఖరీదైందిగా, దృంఢంగా ఉండేలా శాంసంగ్ తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఆల్ట్రా తిన్ గ్లాస్ కవర్ తో ఫోన్ డిజైన్ చేయనుంది. అల్ట్రా తిన్ గ్లాస్ కవర్ తో డిజైన్ చేయడం ద్వారా ఫోన్ ను ఫోల్డ్ చేసేందుకు, ఫోల్డ్ చేసేసమయంలో ఎలాంటి గీతలు పడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోనుంది.
ఈ ఫోన్ తో పాటు అత్యంత ఖరీదైన మోటరోలా రేజర్ లాంటి క్లామ్ షెల్ డిజైన్ ను అందుబాటులోకి  తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ -11 ఫోల్డ్ 2కి ఎలాంటి సంబంధం లేకున్నా ఈ ఫోన్ కంటే క్లామ్ షెల్  తో  డిజైన్ చేసిన ఫోన్  కాస్ట్ ఎక్కువగా ఉండనుంది.
♦   గెలాక్సీ ఫోల్డ్ 2లో  ఎలాంటి ఫీచర్స్  ఉండబోతున్నాయి..?
శాంసంగ్ సంస్థ ఫోల్డ్ మొబైల్ గురించి  అంతగా తెలియని  కోర్ హార్డ్ వేర్ ను వినియోగించినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయినప్పటికి ఫ్లాష్ షిప్ స్పెసిఫికేషన్ తరహాలో మార్కెట్ ను శాసిస్తున్నట్లు కంపెనీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.
సాధారణంగా ఫోన్లు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865తో విడదలవుతాయి. కానీ  శాంసంగ్ సంస్థ ఫోల్డ్ మొబైల్ లో గెలాక్సీ 865 ఎస్ ఓఎస్ తో విడుదల చేయనుంది. 8జీబీ ర్యామ్ నుంచి  128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుందని తెలుస్తోంది.  శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ తో పోలిస్తే  గెలాక్సీ  ఫోల్డ్ -2 ఫోన్ లో  3 మాత్రమే లెన్స్ లు ఉంటాయి. ఆరు కెమెరాలు, బయటవైపు సింగల్ కెమెరా, లోపలి వైపు డ్యూయల్  కెమెరా ఉంటుంది. ఎప్పటిలాగే హెడ్ ఫోన్ జాక్ ను వదిలేసిన…సంస్థ  ఫోన్ జాక్ స్థానంలో  సీ టైప్ ఛార్జర్ పోర్ట్ ను ఇచ్చింది. ఈ ఫోన్ శాంసంగ్  యొక్క ఆండ్రాయిడ్ 10 బేస్డ్ వన్ యుఐ 2 ఆపరేటింగ్ సిస్టమ్ బాక్స్ నుండి బూట్ అవుతుందని భావిస్తుంది.
♦   శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ధర ఎంతంటే..?
గెలాక్సీ గోల్డ్ ఫోన్ తో పోలిస్తే గెలాక్సీ  ఫోల్డ్ -2 ఫోన్ కాస్ట్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు 2వేల డాలర్లు ఉంటుందని స్మార్ట్ ఫోన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సౌత్ సిటీలో ఊపందుకున్న రియల్ బూమ్

హైదరాబాద్ సౌత్ సిటీలో ఊపందుకున్న రియల్ బూమ్

హైదరాబాద్వెలుగుసిటీలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పటివరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లోనే కనిపించడంతో… ఆ ప్రాంతానికి ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. దీంతో ఐటీ కేంద్రంగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట వరకు ఎకరం భూమి ధర రూ.30 కోట్లకు చేరగా… మెరుగైన రవాణా, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో.. కంపెనీలన్నీ అటు వైపు మొగ్గుచూపాయి. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్ కు దగ్గరగా, ఓఆర్ఆర్ ఆనుకుని ఉండటంతో… సౌత్ సిటీలోనూ రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది.
 రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాల జోరు
సిటీ నలుదిశలా రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్లలో నిర్మాణ రంగానికి డిమాండ్ ఉండటంతో… సౌత్ సిటీలో ఉన్న చార్మినార్ కేంద్రంగా రాజేంద్రనగర్, మలక్ పేట్, సంతోష్ నగర్, చాంద్రయాణగుట్ట, ఫలక్ నుమా, రాజేంద్ర నగర్ సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి, కిషన్ బాగ్, నవాబ్ కుర్దు, సంతోష్ నగర్, లలిత్ భాగ్, ఉప్పుగూడ వంటి ప్రాంతాల్లో రెసిడెన్సియల్, కమర్షియల్ భవనాల నిర్మాణాలు జోరందుకున్నాయి. సౌత్ సిటీ చుట్టూ ఫార్మా సిటీ, ఆదిభట్ల ఎయిర్ స్పేస్, తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ, శ్రీశైలం హైవే, కోకాపేట న్యూ సిటీ, బుద్వేల్ ఐటీ పార్క్, కాంచన్ బాగ్ డీఆర్డీఎల్, రాజేంద్ర నగర్ ఆగ్రి వర్సిటీ వంటి ప్రాంతాలకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయి. దీంతో కమర్షియల్ యాక్టివిటీ బాగా పెరుగుతోంది. ఇక్కడ భూముల రేట్లు వెస్ట్, ఈస్ట్ సిటీతో సమానంగా ఉండగా… ఐటీ కారిడార్ కు చేరువలో, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటం సౌత్ జోన్ కు స్పెషల్ అడ్వాంటేజ్.
లాజిస్టిక్ హబ్ లకు అనుకూలం…
ఎయిర్ పోర్టుకు చేరువలో ఉండటంతో.. ఎక్కువగా లాజిస్టిక్ హబ్ లకు సౌత్ సిటీ అనుకూలంగా ఉంది. ఇప్పటికే పోచారంలో ఐటీ పార్కు డెవలప్ చేసినట్లుగా, ఈ ప్రాంతానికి పెద్దగా ఐటీ పార్కులు ఏర్పాటు చేయకపోయినా.. కూడా కమర్షియల్ పరంగా మంచి డిమాండే ఉంది. ముఖ్యంగా అపార్టుమెంట్లు ఇప్పుడిప్పుడే విస్తరిస్తుండగా, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లోనూ  అపార్టుమెంట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. రోడ్లు, స్కూళ్లు, విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి వస్తే గనుక ఈ ఏరియాకు మంచి డిమాండ్ ఉంటుంది. శాటిలైట్ టౌన్ షిప్పులు, వాక్ టు వర్క్ కాన్సెప్టులతో డెవలప్ చేయగలిగితే … సౌత్ సిటీ లో రియల్ క్రయవిక్రయాలు పుంజుకుంటాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
ఈ హోటల్​లో అన్నీ బుల్లి రూమ్సే

ఈ హోటల్​లో అన్నీ బుల్లి రూమ్సే

పని మీద ఊరు కాని ఊరు వెళ్తే.. ఉండటానికి చోటు ఒక సమస్యగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో లాడ్జిల్లో ఉందామంటే కంఫర్ట్‌‌గా ఉండకపోవచ్చు. పోనీ మంచి సౌకర్యాలున్న హోటల్‌‌లో దిగాలంటే.. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యను తీర్చేందుకు వచ్చిందే కాన్సెప్ట్‌‌ ‘క్యాప్సుల్‌‌ హోటల్‌‌’.  జపాన్‌‌లో చాలా ఏళ్ల క్రితమే మొదలైన ఈ ట్రెండ్‌‌.. వయా సింగపూర్‌‌, ఇండియా మీదుగా యూరప్‌‌ని చేరింది. ఇప్పుడు బ్యూటీసిటీ మిలాన్‌‌లో క్యాప్సుల్‌‌ హోటల్స్‌‌దే హవా నడుస్తోంది. ఇంతకీ ఈ ఇస్మార్ట్‌‌ హోటల్‌‌ రూపురేఖలు ఎలా ఉంటాయి? ఎందుకు వాటికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు?…
క్యాప్సుల్‌‌ హోటల్స్‌‌.. సింపుల్‌‌గా చెప్పాలంటే చిన్నసైజులో ఉండే బెడ్‌‌రూమ్స్‌‌తో కూడిన కాంప్లెక్స్‌‌లివి. ఒక చిన్న ఛాంబర్‌‌లో మినిమమ్‌‌ ఫెసిలిటీస్‌‌తో వీటిని ఏర్పాటు చేస్తారు. హోటల్స్‌‌తో పోలిస్తే రేటు చాలా తక్కువ. రాత్రిళ్లు పడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. పైగా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే పనుల మీద వేరే ఊర్లకు వెళ్లేవాళ్లు, టూరిస్టులు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వెస్ట్రన్ వరల్డ్‌‌లో వీటినే ‘పాడ్ హోటల్స్‌‌’ అంటారు. సాధారణంగా ఈ తరహా హోటల్స్‌‌ ఎయిర్‌‌పోర్ట్ దగ్గర్లో కనిపిస్తుంటాయి. అక్కడ వాటిని ‘స్లీప్‌‌బాక్స్‌‌’ పేరుతో పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోనూ క్యాప్సుల్‌‌ హోటల్స్‌‌ బిజినెస్‌‌ పెరుగుతోంది.
సకల సౌకర్యాలు
క్యాప్సుల్ హోటల్‌‌ ఛాంబర్‌‌లు చూడటానికి స్లీపర్‌‌ కోచ్‌‌ బస్సుల్లా ఉంటాయి. ఒక ఛాంబర్‌‌కి మరో ఛాంబర్‌‌ ఆనుకుని ఉంటుంది. ప్లాస్టిక్‌‌ టబ్‌‌ లాంటి నిర్మాణానికి అద్దాల సెటప్‌‌తో డోర్‌‌, దానికొక కర్టెన్‌‌ ఉంటుంది. లోపలికి పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. లోపల చిన్న బెడ్‌‌, లైట్‌‌, పవర్‌‌ ప్లగ్‌‌, వై–ఫై ఫెసిలిటీ ఉంటాయి. కొన్నిసార్లు టీవీ, ల్యాప్‌‌ట్యాప్‌‌ని ఇస్తారు. న్యూస్ పేపర్‌‌, రీడింగ్ మెటీరియల్స్‌‌ అందిస్తారు. జస్ట్ పడుకోవడానికి, రెస్ట్‌‌ తీసుకోవడానికి మాత్రమే సరిపోతాయివి. క్యాప్సుల్‌‌ హోటల్స్‌‌ ఆడ, మగకి విడివిడిగా ఉండొచ్చు. లేదంటే కపుల్‌‌ స్పెషల్‌‌గా ఉంటాయి. ఛాంబర్‌‌ కాంప్లెక్స్‌‌ బయట సామాన్లు భద్రపరుచుకోవడానికి ఒక లాకర్‌‌ ఉంటుంది. క్యాప్సుల్‌‌లో తినడానికి, సిగరెట్‌‌ తాగడానికి వీల్లేదు. అయితే బాత్‌‌రూమ్‌‌లు మాత్రం బయట కామన్‌‌గా ఉంటాయి. కొన్నింటిలో రెస్టారెంట్‌‌, షవర్స్‌‌, స్నాక్ బార్స్‌‌, పూల్స్‌‌.. ఎంటర్‌‌టైన్‌‌మెంట్ ఫెసిలిటీస్‌‌ సెపరేట్‌‌గా ఉంటాయి. కాకపోతే వాటికి కాస్ట్‌‌ ఎక్కువ ఉంటుంది. అయితే ఇరుకు ప్రదేశాలంటే భయం ఉన్నవాళ్లు క్యాప్సుల్ హోటల్‌‌కి దూరంగా ఉండటమే బెటర్‌‌.
వివోలో కొత్త ఫీచర్‌‌‌‌

వివోలో కొత్త ఫీచర్‌‌‌‌

Vivo to introduce earthquake warning feature in FunTouch OS 10
చైనాకు చెందిన స్మార్ట్‌‌ఫోన్‌‌ తయారీ సంస్థ ‘వివో’ త్వరలో కొత్త ఫీచర్‌‌‌‌ను అందుబాటులోకి తేనుంది. స్మార్ట్‌‌ఫోన్లలో ఉండే వెదర్‌‌‌‌ ఫీచర్‌‌‌‌కు అదనంగా ‘ఎర్త్‌‌క్వేక్‌‌ ఫీచర్‌‌‌‌’ను వివో ఫోన్లలో ప్రవేశపెట్టబోతోంది. ‘వివో’ ఫోన్లకు చెందిన ‘ఫన్‌‌టచ్‌‌ ఓఎస్‌‌ 10’ వెర్షన్‌‌లో ఈ ఫీచర్‌‌‌‌ ఉంటుందని కంపెనీ చెప్పింది. వివో ఫోన్లలో ఈ ఫీచర్‌‌‌‌ ఎనేబుల్ చేసుకుంటే చాలు. అక్కడికి దగ్గర్లో భూకంపం వచ్చే అవకాశాలు ఉంటే కొన్ని సెకండ్ల ముందే హెచ్చరిస్తుందని వివో పేర్కొంది. ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌‌‌‌ షావోమీకి చెందిన కొన్ని స్మార్ట్‌‌ఫోన్లలో ఉంది. ‘ఎమ్‌‌ఐయూఐ 11’తోపాటు కొన్ని ‘ఎమ్‌‌ఐ టీవీ’లలో కూడా ఈ ఫీచర్‌‌‌‌ ఉందని షావోమీ తెలిపింది. ఈ డివైజ్‌‌ వాడుతున్న యూజర్లకు భూకంపం గురించి కొన్ని సెకండ్ల ముందే వార్నింగ్‌‌ అలర్ట్‌‌ వస్తుంది. ‘వివో’ ఫోన్లకు సంబంధించి ఈ ఏడాది నుంచి ‘ఆన్‌‌లైన్‌‌ ఎక్స్‌‌క్లూజివ్‌‌ సేల్స్‌‌’ ఆపేస్తామని ప్రకటించింది. ‘2020లో కొత్త ప్రణాళికలకు అనుగుణంగా సెల్‌‌ఫోన్లకు సంబంధించి ఆన్‌‌లైన్‌‌ ఎక్స్‌‌క్లూజివ్‌‌ సేల్స్‌‌’ను ఆపేస్తాం.
ఆన్‌‌లైన్‌‌తోపాటు, రిటైల్‌‌ ఔట్‌‌లెట్‌‌లోనూ ఫోన్లను అందుబాటులో ఉంచుతాం’ అని వివో ప్రతినిధులు అన్నారు. వివోతోపాటు సామ్‌‌సంగ్‌‌, రియల్‌‌ మి, ఒప్పో లాంటి సంస్థలు కూడా ఈ ఏడాదిలో ఇదే పద్ధతిని ఫాలో అవనున్నాయి. త్వరలో విడుదలయ్యే అన్ని మోడల్స్‌‌ను ఆన్‌‌లైన్‌‌, ఆఫ్‌‌లైన్‌‌.. రెండు రకాలుగా అందుబాటులో ఉంచుతారు.
బయో డైవర్శిటీ ఫ్లై ఓవర్‌ను మళ్లీ తెరిచారు

బయో డైవర్శిటీ ఫ్లై ఓవర్‌ను మళ్లీ తెరిచారు

హైదరాబాద్ లోని బయో డైవర్శిటీ ఫ్లై ఓవర్ ను రీ ఓపెన్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు.  నవంబర్ 23.2019న ఫ్లై ఓవర్ పై కారు యాక్సిడెంట్ జరినగప్పటి నుంచి  ఫ్లైఓవర్ ను మూసివేశారు. తర్వాత ఫ్లైఓవర్  స్పీడ్ కంట్రోల్ కంట్రోల్ కోసం ప్రభుత్వం  నిపుణుల కమిటీని వేసింది. కమిటీ  సూచనల మేరకు జీహెచ్ఎంసీ చేపట్టిన పనులను ఇవాళ పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు
ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడిన మేయర్.. ఈ ఫ్లైఓవర్ పై వాహనదారులు 40 కి.మీ స్పీడ్ కు మించి వెళ్లకూడదన్నారు. ఫ్లైఓవర్ పై స్పీడ్ బ్రేకర్స్, కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫ్లైఓవర్ పై సెల్పీలు తీసుకోకుండా సైడ్ వాల్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి సెల్ఫీలు దిగితే ఫైన్ వేస్తామన్నారు. కొన్ని రోజుల పాటు వాహనదారుల కదలికలను, ఫ్లైఓవర్ ను పరిశీలిస్తామన్నారు.
కేసీఆర్ వార్నింగ్: ఓడితే మంత్రి పదవులు ఊడతాయి

కేసీఆర్ వార్నింగ్: ఓడితే మంత్రి పదవులు ఊడతాయి

త్వరలో జరగనున్నమున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్కటి ఓడిపోయినా మంత్రి పదవులు ఊడతాయని హెచ్చరించారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో  జరిగిన TRS విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తామన్నారు. పాత, కొత్త నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు క్యాడర్‌తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలన్నారు. పార్టీ ఒకసారి అభ్యర్థి ని ఫైనల్ చేసిన తర్వాత ఆ అభ్యర్థి గెలుపు కోసమే పని చేయాలని సూచించారు. అవసరమున్న దగ్గర మంత్రులు ప్రచారం చేస్తారన్నారు. మున్సిపోల్స్‌లో టికెట్ల పంపిణీ, ఎన్నికల ప్రచారం, అసంతృప్తుల బుజ్జగింపు, అభ్యర్థుల గెలుపు వరకూ ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు. మరోవైపు బీజేపీతో మనకు పోటీ అనే అపోహ వద్దని, మనకు ఎవరితోనూ పోటీ లేదన్నారు సీఎం కేసీఆర్.
వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి నగలు చోరీ

వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి నగలు చోరీ

తెలంగాణలోని ప్రముఖ దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయం పరిధిలో ఉన్న బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో నగలు చోరీ అయ్యాయి. అమ్మవారి నగలు కన్పించక పోవడంతో ఆలయ పూజారి అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. అమ్మవారి 2.5 గ్రాముల పుస్తెల తాడు, ముక్కు పుడక, కిలో వెండి గొడుగు చోరీ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆలయంలో పూజారులు వంతుల వారీగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఎవరో నగలు చోరీ చేసిఉంటారని తెలుస్తోంది. పూజారుల మార్పిడి క్రమంలో ఈ విషయం బయటకు వచ్చింది. పూజారులకు నోటీసులు జారీ చేశామని… విచారణ చేపట్టినట్లు ఆలయ ఉన్నతాధికారులు తెలిపారు.
మున్సిపోల్స్‌కు రిజర్వేషన్లు విడుదల

మున్సిపోల్స్‌కు రిజర్వేషన్లు విడుదల

పురపాలక ఎలక్షన్లకు సంబంధించి మొదటి దశ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఆయా వర్గాల వారీగా వార్డు పదవుల రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లను కేటాయించారు. ఎస్టీల జనాభా ఒక శాతానికి తక్కువగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లో ఒక వార్డును ఎస్టీలకు రిజర్వ్
చేశారు. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించింది. వార్డుల వారీ రిజర్వేషన్లు రేపు ఖరారు కానున్నాయి.
కార్పొరేషన్లలో రిజర్వేషన్లు
కరీంనగర్ – 60: ఎస్టీ -1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 3, బీసీ – 12, బీసీ మహిళ – 11, జనరల్ మహిళ – 16, జనరల్ – 14
రామగుండం – 36: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 2, ఎస్సీ మహిళ – 2, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 10, జనరల్ – 8
బడంగ్ పేట – 32: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 2, బీసీ – 5, బీసీ మహిళ – 5, జనరల్ మహిళ – 9, జనరల్ – 7
మీర్ పేట – 46: ఎస్టీ – 2, ఎస్టీ మహిళ – 1, ఎస్సీ -4, ఎస్సీ మహిళ -3, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 13, జనరల్ – 10
బండ్లగూడ జాగీర్- 22 : ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ -2, ఎస్సీ మహిళ – 1, బీసీ – 4, బీసీ మహిళ – 3, జనరల్ మహిళ – 7, జనరల్ – 4
బోడుప్పల్ – 28: ఎస్టీ -1, ఎస్టీ మహిళ -0, ఎస్సీ -2, ఎస్సీ మహిళ -1, బీసీ -5, బీసీ మహిళ -5, జనరల్ మహిళ -8, జనరల్ – 6
ఫీర్జాదిగూడ – 26: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 1, ఎస్సీ మహిళ – 1, బీసీ – 5, బీసీ మహిళ – 5, జనరల్ మహిళ – 7, జనరల్ – 6
జవహర్‌నగర్‌ – 28: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 2, బీసీ – 4, బీసీ మహిళ – 4, జనరల్ మహిళ – 8, జనరల్ – 6
నిజాంపేట – 33: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 1, ఎస్సీ మహిళ – 1, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 9, జనరల్ – 8
మున్సిపాలిటీ రిజర్వేషన్లు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 141 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో 128 మున్సిపాలిటీలు కాగా మరో 13 మున్సిపల్ కార్పోరేషన్‌లు‌గా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు 120 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. 8 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు లేవు. మరో  5 మున్సిపాలిటీలకు ఇంకా పదవీకాలం పూర్తవలేదు. వాటిలో జహీరాబాద్, మణుగూరు, పాల్వంచ, సిద్దిపేట, మందమర్రి ఉన్నాయి. కాగా.. రిజర్వేషన్ల వల్ల జడ్చర్ల, నకిరేకల్, అచ్చంపేట కార్పొరేషన్లకు సంబంధించి కేసు కోర్టులో ఉంది. కార్పొరేషన్లకు సంబంధించి.. మొత్తం 13 కార్పొరేషన్లలో మూడు కార్పొరేషన్లకు ప్రస్తుతం ఎన్నికలు లేవు. వాటిలో జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం ఉన్నాయి. వీటికి ఇంకా పదవీకాలం పూర్తి కాలేదు. కాగా మిగిలిన 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో కరీంనగర్, రామగుండం, బడంగ్ పేట, మీర్ పేట, బండ్లగూడ జాగీర్, బొడుప్పల్, ఫీర్జదిగూడ, జవహర్ నగర్, నిజాం పేట, నిజామాబాద్ ఉన్నాయి.
కేసీఆర్ వేములవాడ రాజన్నకు ఇచ్చిన మాట తప్పారు

కేసీఆర్ వేములవాడ రాజన్నకు ఇచ్చిన మాట తప్పారు

  • కేంద్ర నిధులతో ఆలయ అభివృద్ధి చేస్తామన్న ఎంపీ బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల జిల్లా: అధికార పార్టీ మాయమాటలు నమ్మొద్దని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నకి ఇచ్చిన మాటనే తప్పారని అన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయిస్తామని చెప్పి మర్చిపోయారని చెప్పారు. తమను ఎంపీ ఎన్నికల్లో గెలిపించినట్లుగానే మునిసిపల్ ఎన్నికల్లోనూ బీజేపీకి పట్టం కట్టాలని కోరారు ఎంపీ బండి సంజయ్. రాజన్న క్షేత్రం కేంద్రంగా వేములవాడలో శనివారం ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న ఆశీస్సులతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు.
అధికార పార్టీ ఓట్లెట్ల అడుగుతోంది
ఎన్నో ఏళ్లుగా రాజన్న క్షేత్రం అబివృద్దికి నోచుకొలేదన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నకి ఇచ్చిన మాట ప్రకారం 400 కోట్లు కేటాయించలేదని అన్నారు. కేంద్రం నిధులతో వేములవాడ రాజన్న ఆలయాన్ని అబివృద్ది  చేస్తామన్నారు. నిధులు లేవని చెబుతున్న అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు మళ్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగడానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ ప్రజల దృష్టిని మళ్లించడానికి  ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతోందన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి, ఆ తర్వాత విదేశాలకు వెళ్లి పోవడం అధికార ఎమ్యెల్యేకి కామన్‌గా అయిపోయిందని ఆరోపించారు ఎంపీ బండి సంజయ్. అధికార పార్టీ యొక్క మాయమాటలు, మభ్యపెట్టే మాటలను నమ్మొద్దని ప్రజలకు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
శ్లోకాలు జపించడంలో పూజారుల మధ్య వాగ్వాదం

శ్లోకాలు జపించడంలో పూజారుల మధ్య వాగ్వాదం

వైష్ణవ శాఖకు చెందిన రెండు వర్గాల మధ్య  గొడవ జరిగిన ఘటన కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం పూజా సమయంలో వైష్ణవ భక్తులైన తెంకలై, వడకలై వర్గాల మధ్య శ్లోకాలు జపించడంలో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
పెరుమాళ్ ఆలయం 8 వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలో తిరువేది పురం ఉత్సవం నిర్వహించారు.  ఆచారం ప్రకారం  తెంకలై శాఖ భక్తులు శ్రీ మహా విష్ణువును స్తుతిస్తూ అజ్వర్లు రాసి, పాడిన నలైరా దివ్య ప్రబంధం(4,000 తమిళ శ్లోకాల సంకలనం) పఠించడం ప్రారంభించారు. కానీ వడకలై వర్గం ఇందుకు అభ్యంతరం తెలిపింది. ఆ ప్రబంధాన్ని పఠించడం తమకు వ్యతిరేకమని గొడవకు దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు.
దీనిపై  తెంకలై బృందం.. వడకలై సభ్యులు తమను కిందికి నెట్టారని ఆరోపిస్తూ విష్ణుకాంచీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ ముగిసింది.

Wednesday, 11 December 2019

ఆలుగడ్డ చర్మాన్ని మెరిపిస్తుంది…

ఆలుగడ్డ చర్మాన్ని మెరిపిస్తుంది…

ఆలుగడ్డ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతుంది. జుట్టు నుంచి కళ్ల వరకు ఎన్నో సమస్యలకి  చెక్​ పెడుతుంది. ఆలుగడ్డలో ఉండే విటమిన్– బి6 , సి లు  చర్మాన్ని మెరిపిస్తాయ్​. కళ్లకింద నల్లటి వలయాలను తగ్గిస్తాయ్​​. అంతేకాదు బోలెడన్ని చర్మ  సమస్యల్ని  దూరం చేస్తాయ్​.
నేచురల్ బ్లీచ్
చర్మం నల్లగా..కమిలినట్లు అనిపిస్తే   ఆలుగడ్డ గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ముడతలు మాయం
ఆలుగడ్డ  రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు తగ్గుతాయి. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి ఆలుగడ్డ రసాన్ని రాస్తే చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఆలుగడ్డ గుజ్జులో పెరుగు కలిపి ముఖానికి మాస్క్ వేసి, పావుగంట తర్వాత శుభ్రం చేయాలి. ఇలా రెగ్యులర్​గా చేస్తే ముడతలు పోతాయ్​.
మెరిసే చర్మం
ఆలుగడ్డ గుజ్జులో కొద్దిగా ముల్తానీ మట్టి, నిమ్మరసం కలిపి, ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, తెల్లగా అవుతుంది. ఆలుగడ్డ  రసంలో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగితే చర్మం రంగు తేలుతుంది.
నల్లటి వలయాలకి చెక్​
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, కళ్లు ఉబ్బడం లాంటి సమస్యలకు ఆలు చాలా బాగా పనిచేస్తుంది. ఆలుగడ్డ  రసంలో దూది ముంచి, కళ్లపై పావుగంట ఉంచితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే ఆలుగడ్డ గుజ్జు​లో తేనె కలిపి కంటి చుట్టూ రాయాలి.
మచ్చలకు
చర్మంలో అక్కడక్కడా కనిపించే మచ్చలకు ఆలుగడ్డతో  చెక్​ పెట్టొచ్చు. ఆలుగడ్డ  గుజ్జుని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత  శుభ్రం చేస్తే నల్లమచ్చలు తగ్గుతాయి. ఇలా 25 రోజుల పాటు ప్రతిరోజూ చేయాలి.
టోనర్
ఆలుగడ్డ పేస్ట్ లో కొద్దిగా కీరదోస రసం  కలిపి ముఖానికి పట్టించడం వల్ల టోనర్ గా పనిచేస్తుంది.
మెరిసే జుట్టుకు..
ఆలుగడ్డ రసంలో కోడిగుడ్డు తెల్లసొన, కొంచెం నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు మెరుస్తుంది.  అలాగే ఆలుగడ్డ  తొక్కని నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లతో తలస్నానం చేస్తే తెల్ల వెంట్రుకలు కూడా తగ్గుతాయి.
సన్​బర్న్​కి చెక్​
ఆలుగడ్డ  చర్మం మీద గాయాలను, చర్మ సమస్యలను నయం చేస్తుంది. సన్ బర్న్ కూడా నివారిస్తుంది. ఆలుగడ్డను గుండ్రంగా కోసి  ముఖంపై మర్దన చేస్తే ట్యాన్​ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఆనందమే అందం!

ఆనందమే అందం!

ఆనందంలోనే అందం  దాగుంది. ఏంటి…! నమ్మబుద్ది కావట్లేదా? కానీ ఇదే నిజం.  సంతోషంతోనూ అందం ముడిపడి ఉంటుంది. మనమెంత సంతోషంగా, ఉత్సాహంగా ఉంటే మన చర్మం అంతకు పదింతలు ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం హ్యాపీ లైఫ్​తో… ఫెయిరీ లుక్​ మీ సొంతం చేసుకోండి.
ఏదైనా భయపెట్టే సంఘటన జరిగితే చర్మం ఎర్రగా కమిలిపోతుంది. అలిసిపోతే డల్​గా నిర్జీవంగా కనిపిస్తుంది.  నవ్వితే హండ్రెడ్​ ఓల్టేజ్​ బల్బ్​​​లా మెరిసిపోతుంది.  కన్నీళ్లు పెడితే  ముఖంలో ఆ బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మన  ప్రతి రియాక్షన్​ చర్మంపై యాక్షన్ చూపిస్తుందన్నమాట. కానీ వీటన్నింటిని పట్టించుకోకుండా చాలామంది పైపై మెరుగులతో అందంగా కనిపించే ప్రయత్నం చేస్తారు. అయితే మనసు ఆహ్లాదంగా లేకపోతే ఎంత కాస్ట్​లీ ప్రొడక్ట్స్​ వాడినా  ప్రయోజనం ఉండదు.
కంట్రోల్
బాధ, కోపం, ఒత్తిడి, భయం లాంటివి మనసులో చేరినప్పుడు చర్మానికి హాని చేసే హార్మోన్లు విడుదలవుతాయి​. ఫలితంగా చర్మంపై డార్క్​ సర్కిల్స్​, మొటిమలు, నల్లటి మచ్చలు, ముడతలు వస్తాయి​. చర్మం సహజ లక్షణాలని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. మనసు ఇలాంటి ఎమోషన్స్​తో నిండిపోయినప్పుడు అందం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా  ఫలితం ఉండదు. అందువల్ల ఈ ఎమోషన్స్​ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత అందంగా ఉంటారు.
 నవ్వే అందం
ఎవరి ముఖంలోనైనా చూడగానే ఆకట్టుకునేది చిరునవ్వే.  ఆ నవ్వే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మెరిపిస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు మెదడు ఎండార్ఫిన్​ అనే హార్మోన్​ని రిలీజ్​ చేస్తుంది. దానివల్ల డిప్రెషన్, ఒత్తిడి, యాంగ్జైటీల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు బరువు కూడా కంట్రోల్​లో ఉంటుంది.
నెగెటివ్ ఆలోచనలు
నెగెటివ్ ఆలోచనలు బుర్రలో చేరితో అందం ప్రమాదంలో పడినట్టే.  నెగెటివ్​ ఆలోచనల వల్ల కార్టిసాల్​ అనే హార్మోన్​ రిలీజ్ అవుతుంది. దీనివల్ల స్కిన్​ ఆయిలీ అయిపోతుంది. అంతేకాదు, ఈ ఆలోచనల వల్ల  నిద్రలేమి, కోపం, ఒత్తిడి , కొన్ని సందర్భాల్లో ఎలర్జీ లాంటి సమస్యలు చుట్టుముడతాయి​. ఫలితంగా మొటిమలు, మచ్చలు, డార్క్​ సర్కిల్స్​ వంటి సమస్యలొస్తాయి. అందువల్ల ఈ ఆలోచనలకు దూరంగా ఉండాలి.
హ్యాపీ హార్మోన్స్​
సెరటోనిన్ ​, ఆక్సిటోసిన్​, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్​​ లాంటి హ్యాపీ హార్మోన్సే మనసులోని ఆనందానికి,  ముఖంలో చిరునవ్వుకి కారణం. వీటివల్ల చర్మం ఆరోగ్యంగా,  అందంగా మారుతుంది. సెరటోనిన్ డిప్రెషన్ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా చేస్తుంది.  ఆక్సిటోసిన్ హార్మోన్ సెరటోనిన్లను ప్రేరేపించి ఆందోళనను తగ్గిస్తుంది.
ఆత్మవిశ్వాసం
ముఖానికి ఎన్ని మేకప్​ హంగులు అద్దినా కాన్ఫిడెంట్​గా లేకపోతే అంతా వ్యర్థమే. కాన్ఫిడెన్స్​ మిస్​ అయితే చర్మం  భయానికి గురై కమిలిపోతుంది. అంతేకాదు పేలవంగా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అదిచ్చే​ బూస్టప్​తో చర్మం మెరుస్తుంది.
పౌరులు ఎవరు? కానిదెవరు?

పౌరులు ఎవరు? కానిదెవరు?

లోక్ సభలో ప్రవేశపెట్టిన సిటిజన్ షిప్ (సవరణ) బిల్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మనదేశంలోని కొన్ని సరిహద్దు రాష్ట్రాలకు చెందిన సమస్య ప్రస్తుతం దేశవ్యాప్త సమస్యగా మారింది. దేశ విభజన సమయంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిచేసుకోవడానికే బిల్లు తీసుకువచ్చినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే ముస్లింల పట్ల వివక్షకు బిల్లు అద్దం పడుతోందని ప్రతిపక్షాలు రగడ చేస్తున్నాయి. మనదేశ జనాభా 130 కోట్ల పై చిలుకు. అయితే వీరిలో ‘‘ఎవరు పౌరుడు ? ఎవరు కాదు ?’’ అనే కీలకమైన  విషయాన్ని నిగ్గు తేల్చడానికి ఉద్దేశించిందే ‘సిటిజన్ షిప్ (అమెండ్ మెంట్ ) బిల్లు. ‘సిటిజన్ షిప్ యాక్ట్ 1955’కు 2016లో చేసిన సవరణకు పార్లమెంటు ఆమోదం సంపాదించడమే బిల్లు అసలు ఉద్దేశం.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
రాజ్యాంగంలోని 5 నుంచి 11వ వరకు గల ఆర్టికల్స్ లో సిటిజన్ షిప్ ప్రస్తావన ఉంది. 1948 జులై 19 లోగా ఎవరైనా పాకిస్తాన్ నుంచి మనదేశానికి వలస వస్తే వారిని పౌరులుగా భావించవచ్చని ఆర్టికల్ 6 స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ తొమ్మిది ప్రకారం మనదేశం డ్యూయల్ సిటిజన్ షిప్ ను అంగీకరించదు. మరో  దేశం పౌరసత్వం ఉన్నట్లు తేలితే మన దేశ పౌరసత్వం రద్దవుతుంది.
బిల్లు కాంట్రవర్శీ  ఏంటి?
నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించిన సిటిజన్ షిప్ (సవరణ) బిల్లు వివాదాలకు కేంద్రంగా మారింది. ముస్లింలు కానివారికి  వ్యతిరేకంగా బిల్లు రూపొందించారన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్… ఈ మూడు దేశాల నుంచి వలస వచ్చిన ఆరు మతాలకు చెందిన వారు…హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లు మనదేశంలో ఆరేళ్ల పాటు స్థిర నివాసం ఉంటే వారికి పౌరసత్వం ఇచ్చేలా బిల్లులో సవరణలు చేశారు. వీరికి  పౌరసత్వం రావాలంటే 11 ఏళ్ల పాటు ఉండాలన్న రూలు గతంలో ఉండేది. దీనిని ఆరేళ్లకు కుదించారు. అయితే ఈ సడలింపులు  పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు వర్తించవు. బిల్లులోని ఈ అంశమే వివాదమైంది. కేవలం 6 మతాలకు చెందిన వారిని మాత్రమే బిల్లులో చేర్చడం కరెక్ట్ కాదన్నది ప్రతిపక్షాల వాదన. మూడు దేశాల్లో వేధింపులకు గురై ఇండియాకు వలసవచ్చిన ముస్లింలకు కూడా బిల్లును వర్తింపచేయాలన్నది ప్రతిపక్షాల డిమాండ్.
ప్రభుత్వ వాదన
సిటిజన్​షిప్ (సవరణ) బిల్లుపై కేంద్రం ఖచ్చితమైన  వైఖరితో ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్  దేశాల నుంచి తరిమివేతకు గురై మనదేశానికి వచ్చిన  అక్కడి మైనారిటీలను (ముస్లింలు కానివారు మాత్రమే)అక్కున చేర్చుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమంటున్నారు అధికారంలో ఉన్న పెద్దలు. ఈ మూడు దేశాల్లోనూ ఒకే మతస్తులు ఎక్కువ సంఖ్యలో ఉండి తక్కువ సంఖ్యలో ఉన్న మిగతా మతాల వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నది  సర్కార్ ఆరోపణ. ఈ ముస్లిం దేశాల్లోని  మైనారిటీవర్గాల వారు తరచూ దాడులకు కూడా గురయ్యారని  ప్రభుత్వం పేర్కొంది. ఇలా ఈ మూడు దేశాల నుంచి  గెంటివేతకు గురై మనదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడం మానవత్వంతో కూడిన పని అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ముస్లింలకు బిల్లు వ్యతిరేకమన్న ఆరోపణలను తిప్పి కొట్టింది.  నూటికి నూరు శాతం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సిటిజన్‌షిప్ బిల్లు రూపొందించినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్  నుంచి మనదేశంలోకి  వలసవచ్చిన వాళ్లు వేలాది మంది ఉన్నారు. వీళ్లల్లో ఎక్కువ మంది ముస్లింలే. ఈ వలసలు  నిన్నటివో, మొన్నటివో కావు. చాలా ఏళ్ల కిందటివి. వీళ్లంతా ఎక్కువగా సరిహద్దు రాష్ట్రాల్లో తిష్ట వేసి ప్రస్తుతం పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా సరిహద్దుల్లో కంచెలు దాటి అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించిన వారిపై ఆయా రాష్ట్రాల ప్రజలకు సదభిప్రాయం లేదు. వాళ్లపై  బోలెడన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఈ బ్యాక్ డ్రాప్‌లో మూడు పొరుగుదేశాల నుంచి బతుకుజీవుడా అంటూ వలసవచ్చిన ముస్లింలు కానివారిని దృష్టిలో పెట్టుకుని ‘సిటిజన్ షిప్ (సవరణ)బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈశాన్య రాష్ట్రాల వైఖరేంటి?
సిటిజన్‌షిప్ బిల్లుకు ఈశాన్య రాష్ట్రాల్లో వ్యతిరేకత కనపడుతోంది. ఎందుకంటే, తమ రాష్ట్రాల్లో తాము మైనారిటీలుగా మారే అవకాశముందని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. వలసవచ్చిన వారు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండటం దీనికి కారణం. అయితే ఇవన్నీ అపోహలేనంటున్నారు బీజేపీ లీడర్లు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు,  వాళ్ల కల్చర్ ను దెబ్బతీసే ఎలాంటి పనులు తాము చేయబోమని హామీ ఇచ్చారు. అస్సాం, నాగాలాండ్, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అలాగే సిటిజన్ షిప్ బిల్లు 1985 నాటి అస్సాం ఒప్పందానికి బిల్లు వ్యతిరేకమన్న  ప్రచారం జోరుగా జరిగింది. అస్సాం ఉద్యమకారులు, అప్పటి కేంద్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అక్రమ వలసలు ఏవో తేల్చడానికి 1971 మార్చి 25వ తేదీని కటాఫ్ డేట్ గా తీసుకున్నారు. ఆ తరువాత అస్సాంలోకి ఎవరు ప్రవేశించినా, వాళ్లు ఏ మతం వారైనా చొరబాటుదారులుగానే గుర్తిస్తారు. అయితే ఆరేళ్ల పాటు మనదేశంలో ఉంటే వలస వచ్చిన వాళ్లకు  పౌరసత్వం ఇచ్చేలా సిటిజన్ షిప్ బిల్లును రూపొందించారన్నది అస్సాం ప్రజల వాదన.
2016 జూలైలోనే లోక్సభకు బిల్లు
సిటిజన్​షిప్ (సవరణ) బిల్లును 2016 జులై 19నే లోక్​సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై   స్టడీ చేయడానికి  ‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ’(జేపీసీ) కి పంపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో అదే ఏడాది ఆగస్టు 12న బిల్లుపై  జేపీసీ వేశారు. సవరణ బిల్లుపై స్టడీ చేసిన తరువాత 2019 జనవరి 7న జేపీసీ తన రిపోర్ట్ ను పార్లమెంటుకు అందచేసింది. ఆ మర్నాడే..జనవరి 8న బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టడం, సభ ఆమోదించడం జరిగిపోయాయి.  ఈ బ్యాక్ డ్రాప్‌లో రాజ్యసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి రెడీ అవుతుండగా ఇదే ఏడాది ఫిబ్రవరి 13న రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోయింది. పార్లమెంటరీ నియమాల ప్రకారం ఏదైనా బిల్లు లోక్ సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్ లో ఉంటే సమావేశాలు మళ్లీ  ప్రారంభమైన తరువాత ప్రవేశపెట్టవచ్చు. అయితే 2019 ఎన్నికల షెడ్యూల్ రావడంతో 16వ లోక్ సభ రద్దయింది. దీంతో బిల్లును మళ్లీ లోక్ సభ ఆ తరువాత రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సిందేనని పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లును సోమవారం ఫ్రెష్ గా లోక్ సభలో ప్రవేశపెట్టింది.
తప్పులు దిద్దుకోవడానికే..
దేశ విభజన సమయంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికే బిల్లును రూపొందించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.విభజన టైంలో మిగతా దేశాల్లో ఉండి మతం కారణంగా అక్కడ అనేక రకాలుగా  ఇబ్బందులు పడ్డ భారతీయ మూలాలున్న వారికి ఆశ్రయం ఇవ్వడానికే బిల్లును రూపొందించినట్లు ఈ ఏడాది జనవరిలో అసోంలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ ప్రధాని చెప్పారు. సిటిజన్ షిప్ బిల్లును ఆయన పూర్తిగా వెనకేసుకొచ్చారు.
సవరణకు అసలు కారణం ఇదీ!
దేశ విభజన తర్వాత పశ్చిమ బెంగాల్​లోని బెంగాలీ ముస్లింలుగానీ, ఈస్ట్​ బెంగాల్​ (ప్రస్తుత బంగ్లాదేశ్​)లోని హిందువులుగానీ అటు ఇటు మారిపోలేదు. ఎక్కడివాళ్లు అక్కడే ఉన్నారు.  పాకిస్థాన్​లోని హిందువులు, సిక్కులు మైనారిటీలు కాగా, ఇండియాలో ముస్లింలు మైనారిటీలు అయ్యారు..
1950లో ఇండియా ప్రధాని నెహ్రూ, పాక్​ ప్రధాని లియాఖత్​ అలీఖాన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. మైనారిటీలకు సెక్యూరిటీ, హక్కులు, ఫ్రీడం. మైనారిటీలకు గవర్నమెంట్​ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, ఆర్మ్​డ్​ ఫోర్సెస్​లో ప్రాధాన్యత. స్వదేశానికి తిరిగి రావటానికి ఇష్టపడనివాళ్లను సిటిజన్లుగా గుర్తించాలి. ఈ ఒప్పందానికి ఇండియా సిన్సియర్​గా కట్టుబడి ఉండగా పాకిస్థాన్​​ ఉల్లంఘించింది.  ‘సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ బిల్లు–2019’పై చర్చల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలో ముస్లింల జనాభా పెరుగుతున్నప్పటికీ,  పాక్​, బంగ్లాల్లో హిందువులు, సిక్కుల పాపులేషన్​ తగ్గుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా, ఇండియన్​ సిటిజెన్​షిప్​ యాక్ట్​–1955లో అమల్లోకి రాగా, ఇప్పటివరకు 5 సార్లు సవరించారు.