Wednesday, 11 December 2019

ఆలుగడ్డ చర్మాన్ని మెరిపిస్తుంది…

ఆలుగడ్డ చర్మాన్ని మెరిపిస్తుంది…

ఆలుగడ్డ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతుంది. జుట్టు నుంచి కళ్ల వరకు ఎన్నో సమస్యలకి  చెక్​ పెడుతుంది. ఆలుగడ్డలో ఉండే విటమిన్– బి6 , సి లు  చర్మాన్ని మెరిపిస్తాయ్​. కళ్లకింద నల్లటి వలయాలను తగ్గిస్తాయ్​​. అంతేకాదు బోలెడన్ని చర్మ  సమస్యల్ని  దూరం చేస్తాయ్​.
నేచురల్ బ్లీచ్
చర్మం నల్లగా..కమిలినట్లు అనిపిస్తే   ఆలుగడ్డ గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ముడతలు మాయం
ఆలుగడ్డ  రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు తగ్గుతాయి. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి ఆలుగడ్డ రసాన్ని రాస్తే చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఆలుగడ్డ గుజ్జులో పెరుగు కలిపి ముఖానికి మాస్క్ వేసి, పావుగంట తర్వాత శుభ్రం చేయాలి. ఇలా రెగ్యులర్​గా చేస్తే ముడతలు పోతాయ్​.
మెరిసే చర్మం
ఆలుగడ్డ గుజ్జులో కొద్దిగా ముల్తానీ మట్టి, నిమ్మరసం కలిపి, ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, తెల్లగా అవుతుంది. ఆలుగడ్డ  రసంలో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగితే చర్మం రంగు తేలుతుంది.
నల్లటి వలయాలకి చెక్​
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, కళ్లు ఉబ్బడం లాంటి సమస్యలకు ఆలు చాలా బాగా పనిచేస్తుంది. ఆలుగడ్డ  రసంలో దూది ముంచి, కళ్లపై పావుగంట ఉంచితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే ఆలుగడ్డ గుజ్జు​లో తేనె కలిపి కంటి చుట్టూ రాయాలి.
మచ్చలకు
చర్మంలో అక్కడక్కడా కనిపించే మచ్చలకు ఆలుగడ్డతో  చెక్​ పెట్టొచ్చు. ఆలుగడ్డ  గుజ్జుని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత  శుభ్రం చేస్తే నల్లమచ్చలు తగ్గుతాయి. ఇలా 25 రోజుల పాటు ప్రతిరోజూ చేయాలి.
టోనర్
ఆలుగడ్డ పేస్ట్ లో కొద్దిగా కీరదోస రసం  కలిపి ముఖానికి పట్టించడం వల్ల టోనర్ గా పనిచేస్తుంది.
మెరిసే జుట్టుకు..
ఆలుగడ్డ రసంలో కోడిగుడ్డు తెల్లసొన, కొంచెం నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు మెరుస్తుంది.  అలాగే ఆలుగడ్డ  తొక్కని నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లతో తలస్నానం చేస్తే తెల్ల వెంట్రుకలు కూడా తగ్గుతాయి.
సన్​బర్న్​కి చెక్​
ఆలుగడ్డ  చర్మం మీద గాయాలను, చర్మ సమస్యలను నయం చేస్తుంది. సన్ బర్న్ కూడా నివారిస్తుంది. ఆలుగడ్డను గుండ్రంగా కోసి  ముఖంపై మర్దన చేస్తే ట్యాన్​ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఆనందమే అందం!

ఆనందమే అందం!

ఆనందంలోనే అందం  దాగుంది. ఏంటి…! నమ్మబుద్ది కావట్లేదా? కానీ ఇదే నిజం.  సంతోషంతోనూ అందం ముడిపడి ఉంటుంది. మనమెంత సంతోషంగా, ఉత్సాహంగా ఉంటే మన చర్మం అంతకు పదింతలు ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం హ్యాపీ లైఫ్​తో… ఫెయిరీ లుక్​ మీ సొంతం చేసుకోండి.
ఏదైనా భయపెట్టే సంఘటన జరిగితే చర్మం ఎర్రగా కమిలిపోతుంది. అలిసిపోతే డల్​గా నిర్జీవంగా కనిపిస్తుంది.  నవ్వితే హండ్రెడ్​ ఓల్టేజ్​ బల్బ్​​​లా మెరిసిపోతుంది.  కన్నీళ్లు పెడితే  ముఖంలో ఆ బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మన  ప్రతి రియాక్షన్​ చర్మంపై యాక్షన్ చూపిస్తుందన్నమాట. కానీ వీటన్నింటిని పట్టించుకోకుండా చాలామంది పైపై మెరుగులతో అందంగా కనిపించే ప్రయత్నం చేస్తారు. అయితే మనసు ఆహ్లాదంగా లేకపోతే ఎంత కాస్ట్​లీ ప్రొడక్ట్స్​ వాడినా  ప్రయోజనం ఉండదు.
కంట్రోల్
బాధ, కోపం, ఒత్తిడి, భయం లాంటివి మనసులో చేరినప్పుడు చర్మానికి హాని చేసే హార్మోన్లు విడుదలవుతాయి​. ఫలితంగా చర్మంపై డార్క్​ సర్కిల్స్​, మొటిమలు, నల్లటి మచ్చలు, ముడతలు వస్తాయి​. చర్మం సహజ లక్షణాలని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. మనసు ఇలాంటి ఎమోషన్స్​తో నిండిపోయినప్పుడు అందం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా  ఫలితం ఉండదు. అందువల్ల ఈ ఎమోషన్స్​ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత అందంగా ఉంటారు.
 నవ్వే అందం
ఎవరి ముఖంలోనైనా చూడగానే ఆకట్టుకునేది చిరునవ్వే.  ఆ నవ్వే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మెరిపిస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు మెదడు ఎండార్ఫిన్​ అనే హార్మోన్​ని రిలీజ్​ చేస్తుంది. దానివల్ల డిప్రెషన్, ఒత్తిడి, యాంగ్జైటీల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు బరువు కూడా కంట్రోల్​లో ఉంటుంది.
నెగెటివ్ ఆలోచనలు
నెగెటివ్ ఆలోచనలు బుర్రలో చేరితో అందం ప్రమాదంలో పడినట్టే.  నెగెటివ్​ ఆలోచనల వల్ల కార్టిసాల్​ అనే హార్మోన్​ రిలీజ్ అవుతుంది. దీనివల్ల స్కిన్​ ఆయిలీ అయిపోతుంది. అంతేకాదు, ఈ ఆలోచనల వల్ల  నిద్రలేమి, కోపం, ఒత్తిడి , కొన్ని సందర్భాల్లో ఎలర్జీ లాంటి సమస్యలు చుట్టుముడతాయి​. ఫలితంగా మొటిమలు, మచ్చలు, డార్క్​ సర్కిల్స్​ వంటి సమస్యలొస్తాయి. అందువల్ల ఈ ఆలోచనలకు దూరంగా ఉండాలి.
హ్యాపీ హార్మోన్స్​
సెరటోనిన్ ​, ఆక్సిటోసిన్​, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్​​ లాంటి హ్యాపీ హార్మోన్సే మనసులోని ఆనందానికి,  ముఖంలో చిరునవ్వుకి కారణం. వీటివల్ల చర్మం ఆరోగ్యంగా,  అందంగా మారుతుంది. సెరటోనిన్ డిప్రెషన్ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా చేస్తుంది.  ఆక్సిటోసిన్ హార్మోన్ సెరటోనిన్లను ప్రేరేపించి ఆందోళనను తగ్గిస్తుంది.
ఆత్మవిశ్వాసం
ముఖానికి ఎన్ని మేకప్​ హంగులు అద్దినా కాన్ఫిడెంట్​గా లేకపోతే అంతా వ్యర్థమే. కాన్ఫిడెన్స్​ మిస్​ అయితే చర్మం  భయానికి గురై కమిలిపోతుంది. అంతేకాదు పేలవంగా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అదిచ్చే​ బూస్టప్​తో చర్మం మెరుస్తుంది.
పౌరులు ఎవరు? కానిదెవరు?

పౌరులు ఎవరు? కానిదెవరు?

లోక్ సభలో ప్రవేశపెట్టిన సిటిజన్ షిప్ (సవరణ) బిల్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మనదేశంలోని కొన్ని సరిహద్దు రాష్ట్రాలకు చెందిన సమస్య ప్రస్తుతం దేశవ్యాప్త సమస్యగా మారింది. దేశ విభజన సమయంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిచేసుకోవడానికే బిల్లు తీసుకువచ్చినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే ముస్లింల పట్ల వివక్షకు బిల్లు అద్దం పడుతోందని ప్రతిపక్షాలు రగడ చేస్తున్నాయి. మనదేశ జనాభా 130 కోట్ల పై చిలుకు. అయితే వీరిలో ‘‘ఎవరు పౌరుడు ? ఎవరు కాదు ?’’ అనే కీలకమైన  విషయాన్ని నిగ్గు తేల్చడానికి ఉద్దేశించిందే ‘సిటిజన్ షిప్ (అమెండ్ మెంట్ ) బిల్లు. ‘సిటిజన్ షిప్ యాక్ట్ 1955’కు 2016లో చేసిన సవరణకు పార్లమెంటు ఆమోదం సంపాదించడమే బిల్లు అసలు ఉద్దేశం.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
రాజ్యాంగంలోని 5 నుంచి 11వ వరకు గల ఆర్టికల్స్ లో సిటిజన్ షిప్ ప్రస్తావన ఉంది. 1948 జులై 19 లోగా ఎవరైనా పాకిస్తాన్ నుంచి మనదేశానికి వలస వస్తే వారిని పౌరులుగా భావించవచ్చని ఆర్టికల్ 6 స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ తొమ్మిది ప్రకారం మనదేశం డ్యూయల్ సిటిజన్ షిప్ ను అంగీకరించదు. మరో  దేశం పౌరసత్వం ఉన్నట్లు తేలితే మన దేశ పౌరసత్వం రద్దవుతుంది.
బిల్లు కాంట్రవర్శీ  ఏంటి?
నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించిన సిటిజన్ షిప్ (సవరణ) బిల్లు వివాదాలకు కేంద్రంగా మారింది. ముస్లింలు కానివారికి  వ్యతిరేకంగా బిల్లు రూపొందించారన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్… ఈ మూడు దేశాల నుంచి వలస వచ్చిన ఆరు మతాలకు చెందిన వారు…హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లు మనదేశంలో ఆరేళ్ల పాటు స్థిర నివాసం ఉంటే వారికి పౌరసత్వం ఇచ్చేలా బిల్లులో సవరణలు చేశారు. వీరికి  పౌరసత్వం రావాలంటే 11 ఏళ్ల పాటు ఉండాలన్న రూలు గతంలో ఉండేది. దీనిని ఆరేళ్లకు కుదించారు. అయితే ఈ సడలింపులు  పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు వర్తించవు. బిల్లులోని ఈ అంశమే వివాదమైంది. కేవలం 6 మతాలకు చెందిన వారిని మాత్రమే బిల్లులో చేర్చడం కరెక్ట్ కాదన్నది ప్రతిపక్షాల వాదన. మూడు దేశాల్లో వేధింపులకు గురై ఇండియాకు వలసవచ్చిన ముస్లింలకు కూడా బిల్లును వర్తింపచేయాలన్నది ప్రతిపక్షాల డిమాండ్.
ప్రభుత్వ వాదన
సిటిజన్​షిప్ (సవరణ) బిల్లుపై కేంద్రం ఖచ్చితమైన  వైఖరితో ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్  దేశాల నుంచి తరిమివేతకు గురై మనదేశానికి వచ్చిన  అక్కడి మైనారిటీలను (ముస్లింలు కానివారు మాత్రమే)అక్కున చేర్చుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమంటున్నారు అధికారంలో ఉన్న పెద్దలు. ఈ మూడు దేశాల్లోనూ ఒకే మతస్తులు ఎక్కువ సంఖ్యలో ఉండి తక్కువ సంఖ్యలో ఉన్న మిగతా మతాల వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నది  సర్కార్ ఆరోపణ. ఈ ముస్లిం దేశాల్లోని  మైనారిటీవర్గాల వారు తరచూ దాడులకు కూడా గురయ్యారని  ప్రభుత్వం పేర్కొంది. ఇలా ఈ మూడు దేశాల నుంచి  గెంటివేతకు గురై మనదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడం మానవత్వంతో కూడిన పని అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ముస్లింలకు బిల్లు వ్యతిరేకమన్న ఆరోపణలను తిప్పి కొట్టింది.  నూటికి నూరు శాతం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సిటిజన్‌షిప్ బిల్లు రూపొందించినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్  నుంచి మనదేశంలోకి  వలసవచ్చిన వాళ్లు వేలాది మంది ఉన్నారు. వీళ్లల్లో ఎక్కువ మంది ముస్లింలే. ఈ వలసలు  నిన్నటివో, మొన్నటివో కావు. చాలా ఏళ్ల కిందటివి. వీళ్లంతా ఎక్కువగా సరిహద్దు రాష్ట్రాల్లో తిష్ట వేసి ప్రస్తుతం పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా సరిహద్దుల్లో కంచెలు దాటి అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించిన వారిపై ఆయా రాష్ట్రాల ప్రజలకు సదభిప్రాయం లేదు. వాళ్లపై  బోలెడన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఈ బ్యాక్ డ్రాప్‌లో మూడు పొరుగుదేశాల నుంచి బతుకుజీవుడా అంటూ వలసవచ్చిన ముస్లింలు కానివారిని దృష్టిలో పెట్టుకుని ‘సిటిజన్ షిప్ (సవరణ)బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈశాన్య రాష్ట్రాల వైఖరేంటి?
సిటిజన్‌షిప్ బిల్లుకు ఈశాన్య రాష్ట్రాల్లో వ్యతిరేకత కనపడుతోంది. ఎందుకంటే, తమ రాష్ట్రాల్లో తాము మైనారిటీలుగా మారే అవకాశముందని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. వలసవచ్చిన వారు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండటం దీనికి కారణం. అయితే ఇవన్నీ అపోహలేనంటున్నారు బీజేపీ లీడర్లు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు,  వాళ్ల కల్చర్ ను దెబ్బతీసే ఎలాంటి పనులు తాము చేయబోమని హామీ ఇచ్చారు. అస్సాం, నాగాలాండ్, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అలాగే సిటిజన్ షిప్ బిల్లు 1985 నాటి అస్సాం ఒప్పందానికి బిల్లు వ్యతిరేకమన్న  ప్రచారం జోరుగా జరిగింది. అస్సాం ఉద్యమకారులు, అప్పటి కేంద్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అక్రమ వలసలు ఏవో తేల్చడానికి 1971 మార్చి 25వ తేదీని కటాఫ్ డేట్ గా తీసుకున్నారు. ఆ తరువాత అస్సాంలోకి ఎవరు ప్రవేశించినా, వాళ్లు ఏ మతం వారైనా చొరబాటుదారులుగానే గుర్తిస్తారు. అయితే ఆరేళ్ల పాటు మనదేశంలో ఉంటే వలస వచ్చిన వాళ్లకు  పౌరసత్వం ఇచ్చేలా సిటిజన్ షిప్ బిల్లును రూపొందించారన్నది అస్సాం ప్రజల వాదన.
2016 జూలైలోనే లోక్సభకు బిల్లు
సిటిజన్​షిప్ (సవరణ) బిల్లును 2016 జులై 19నే లోక్​సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై   స్టడీ చేయడానికి  ‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ’(జేపీసీ) కి పంపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో అదే ఏడాది ఆగస్టు 12న బిల్లుపై  జేపీసీ వేశారు. సవరణ బిల్లుపై స్టడీ చేసిన తరువాత 2019 జనవరి 7న జేపీసీ తన రిపోర్ట్ ను పార్లమెంటుకు అందచేసింది. ఆ మర్నాడే..జనవరి 8న బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టడం, సభ ఆమోదించడం జరిగిపోయాయి.  ఈ బ్యాక్ డ్రాప్‌లో రాజ్యసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి రెడీ అవుతుండగా ఇదే ఏడాది ఫిబ్రవరి 13న రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోయింది. పార్లమెంటరీ నియమాల ప్రకారం ఏదైనా బిల్లు లోక్ సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్ లో ఉంటే సమావేశాలు మళ్లీ  ప్రారంభమైన తరువాత ప్రవేశపెట్టవచ్చు. అయితే 2019 ఎన్నికల షెడ్యూల్ రావడంతో 16వ లోక్ సభ రద్దయింది. దీంతో బిల్లును మళ్లీ లోక్ సభ ఆ తరువాత రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సిందేనని పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లును సోమవారం ఫ్రెష్ గా లోక్ సభలో ప్రవేశపెట్టింది.
తప్పులు దిద్దుకోవడానికే..
దేశ విభజన సమయంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికే బిల్లును రూపొందించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.విభజన టైంలో మిగతా దేశాల్లో ఉండి మతం కారణంగా అక్కడ అనేక రకాలుగా  ఇబ్బందులు పడ్డ భారతీయ మూలాలున్న వారికి ఆశ్రయం ఇవ్వడానికే బిల్లును రూపొందించినట్లు ఈ ఏడాది జనవరిలో అసోంలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ ప్రధాని చెప్పారు. సిటిజన్ షిప్ బిల్లును ఆయన పూర్తిగా వెనకేసుకొచ్చారు.
సవరణకు అసలు కారణం ఇదీ!
దేశ విభజన తర్వాత పశ్చిమ బెంగాల్​లోని బెంగాలీ ముస్లింలుగానీ, ఈస్ట్​ బెంగాల్​ (ప్రస్తుత బంగ్లాదేశ్​)లోని హిందువులుగానీ అటు ఇటు మారిపోలేదు. ఎక్కడివాళ్లు అక్కడే ఉన్నారు.  పాకిస్థాన్​లోని హిందువులు, సిక్కులు మైనారిటీలు కాగా, ఇండియాలో ముస్లింలు మైనారిటీలు అయ్యారు..
1950లో ఇండియా ప్రధాని నెహ్రూ, పాక్​ ప్రధాని లియాఖత్​ అలీఖాన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. మైనారిటీలకు సెక్యూరిటీ, హక్కులు, ఫ్రీడం. మైనారిటీలకు గవర్నమెంట్​ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, ఆర్మ్​డ్​ ఫోర్సెస్​లో ప్రాధాన్యత. స్వదేశానికి తిరిగి రావటానికి ఇష్టపడనివాళ్లను సిటిజన్లుగా గుర్తించాలి. ఈ ఒప్పందానికి ఇండియా సిన్సియర్​గా కట్టుబడి ఉండగా పాకిస్థాన్​​ ఉల్లంఘించింది.  ‘సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ బిల్లు–2019’పై చర్చల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలో ముస్లింల జనాభా పెరుగుతున్నప్పటికీ,  పాక్​, బంగ్లాల్లో హిందువులు, సిక్కుల పాపులేషన్​ తగ్గుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా, ఇండియన్​ సిటిజెన్​షిప్​ యాక్ట్​–1955లో అమల్లోకి రాగా, ఇప్పటివరకు 5 సార్లు సవరించారు.
శ్లోకాలు జపించడంలో పూజారుల మధ్య వాగ్వాదం

శ్లోకాలు జపించడంలో పూజారుల మధ్య వాగ్వాదం

వైష్ణవ శాఖకు చెందిన రెండు వర్గాల మధ్య  గొడవ జరిగిన ఘటన కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం పూజా సమయంలో వైష్ణవ భక్తులైన తెంకలై, వడకలై వర్గాల మధ్య శ్లోకాలు జపించడంలో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
పెరుమాళ్ ఆలయం 8 వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలో తిరువేది పురం ఉత్సవం నిర్వహించారు.  ఆచారం ప్రకారం  తెంకలై శాఖ భక్తులు శ్రీ మహా విష్ణువును స్తుతిస్తూ అజ్వర్లు రాసి, పాడిన నలైరా దివ్య ప్రబంధం(4,000 తమిళ శ్లోకాల సంకలనం) పఠించడం ప్రారంభించారు. కానీ వడకలై వర్గం ఇందుకు అభ్యంతరం తెలిపింది. ఆ ప్రబంధాన్ని పఠించడం తమకు వ్యతిరేకమని గొడవకు దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు.
దీనిపై  తెంకలై బృందం.. వడకలై సభ్యులు తమను కిందికి నెట్టారని ఆరోపిస్తూ విష్ణుకాంచీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ ముగిసింది.
More images for శ్లోకాలు జపించడంలో పూజారుల మధ్య

Search Results

Web results

Nov 6, 2019 - వైష్ణవ శాఖకు చెందిన రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన ఘటన కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం పూజా సమయంలో వైష్ణవ భక్తులైన తెంకలై, వడకలై వర్గాల మధ్య శ్లోకాలు జపించడంలో వాగ్వాదం ...

Web results

May 12, 2017 - Uploaded by Astro Village
సంతానం కోసం స్త్రీలు జపించాల్సిన మంత్రం | Sloka to Conceive and Get Pregnant | Episode_61 | Astro. Astro Village ... Women with ...
Missing: pujarula ‎madhya

Web results

Nov 6, 2019 - Telangana News, Telangana Telugu news, Hyderabad news, Hyderabad Telugu news, epaper telugu,telugu epaper, telugu news articles, darwaza telugu magazine, special magazines, Velugu Life edition, Velugu success edition,breaking news in telugu, weather news in telugu, cricket news in telugu ...

Web results

ఈ సమయంలో మధ్య గంగా మైదానంలో వేదేతర ఇండో-ఆర్య సంస్కృతి ఆధిపత్యం చెలాయించింది. .... వేద కాలం స్థావరాలు నాలుగు: బ్రాహ్మణ పూజారులు మొదటి వారు, యోధుల ప్రభువులు రెండవ వారు, రైతులు, వ్యాపారులు మూడవవారు, .... ప్రార్థనా విధానం యఙయాగాల పనితీరు (యజ్ఞం)లో, ఇందులో ఋగ్వేద వచనాలు జపించడం (వేద శ్లోకం చూడండి), సామవేద గీతాలు ​​పాడటం, ...
సనాతన ధర్మం-నిత్య నూతనం, గుంటూరు. 13137 likes · 1258 talking about this. సనాతన భారతీయ సంస్కృతిలో మనమెక్కడ?
దేవుడికి పూజలు చేసే పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు. ... స్తోత్రంలో మొదటి 41 శ్లోకాలు "ఆనంద లహరి" అని, తరువాతవి దేవీ సౌందర్యాన్ని కీర్తించే "సౌందర్య లహరి" అని అంటారు కాని ఈ ... అన్ని మంత్ర స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా గురువును స్మరించాలి. .... కనుకనే దయతో దేవి యొసగిన స్తన్యమును గ్రోలిన ద్రవిడశిశువు ప్రౌఢకవుల మధ్య కమనీయకనియయ్యెను. 76.
Oct 8, 2016 - దీని శ్లోకాలు కాస్మోగోనీ, నాలుగు ఆశ్రమాలు, ప్రభుత్వం, దేశీయ వ్యవహారాలు, కులం మరియు నైతికతను ..... అనుసంధానించింది: దేవాలయాల్లోని పూజారులు ఇప్పుడు అందరూ బ్రాహ్మణులు మరియు వీరంతా సంస్కృతాన్ని ఆచారాలలో .... హిందూ జాతీయవాదులు పెరిగిన కాలంలో, భారతదేశంలో హిందువులు మరియు ముస్లింల మధ్య సంబంధాలకు చాలా నష్టం జరిగింది. ... పేర్లు జపించడం, ధ్యానం మరియు వ్యక్తిగత ప్రార్థన వంటి సరళమైన, మరింత సమతౌల్య పద్ధతులకు అనుకూలంగా.
Jun 11, 2018 - ... అధికారికంగా నిర్వహించనున్న కార్యక్రమాల నుంచి సూర్యనమస్కార్ ఆసనాలను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. యోగాలో పాల్గొనేవారు శ్లోకాలను జపించడం తప్పనిసరికాదని కూడా స్పష్టంచేసింది.